AP Latest Updates

Academic Exam Papers

AP GOs

Current Affairs

TS GOs

Saturday, 6 May 2023

AP Model School 6th Class Admission 2023 Notification Application Schedule

AP Model School 6th Class Admission 2023 Notification Application Schedule

 ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో 6 వ తరగతి ప్రవేశం కొరకు ప్రకటన*

2023-24 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో చేర్చుకొనుటకై 11/06/2023(ఆదివారం) నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించబడును.


*ప్రవేశ అర్హత* : 

1.  2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది వుండాలి.

2. *వయస్సు*: 

OBC - 01/09/2011 -31/8/2013 మధ్య పుట్టి వుండాలి.

SC,ST - 01/09/2009 -31/08/2013 మధ్య పుట్టి వుండాలి.



3. *ప్రవేశ పరీక్ష* :

🗓️ప్రవేశ పరీక్ష తేది: 11/06/2023

🕙సమయం: ఉ. 10.00 గం. - ఉ.12 గం.

🏢Venue: సంభందిత మోడల్ స్కూల్

📝పరీక్ష మీడియం: తెలుగు/ఇంగ్లిష్ 


ఆబ్జెక్టివ్ టైప్ లో జరిగే ప్రవేశ పరీక్షలో అర్హత మార్కులు కింది విధంగా సాధించాలి.

*OC,BC విద్యార్థులు - 35* మార్కులు

*SC,ST విద్యార్థులు - 30 మార్కులు*



*దరఖాస్తు చేయు విధానము*:

www.cse.ap.gov.in ద్వారా (online లో) ఏదేని నెట్ సెంటర్ లో చేసుకోవాలి.


*పరీక్ష రుసుము*:

OC,BC - RS.150/-

SC,ST - RS. 75/-


*Tentative schedule*

1. రుసుము చెల్లించడం: 09/05/2023 నుంచి


2. అప్లికేషన్స్ స్వీకరణ తేదీ: 10/05/2023 నుంచి


3. రుసుము చెల్లించుటకు ఆఖరు తేదీ : 25/05/2023


4. ప్రవేశ పరీక్ష తేదీ : 11/06/2023


Click here to Download Admission Notification

Click here to Download Application Form

Download Press Note for Admission

Friday, 5 May 2023

AP SSC Results 2023 Download

 AP SSC Results 2023 Download

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాల (AP Tenth Results 2023) విడుదల ఎప్పుడనే ఉత్కంఠకు తెరపడింది.


ఫలితాల విడుదల తేదీని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్వయంగా ప్రకటించారు. రేపు అంటే.. ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ఈ మేరకు విద్యాశాఖ సైతం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు https://www.bse.ap.gov.in/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది పరీక్షలకు మొత్తం 6,64,152 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్‌ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను https://www.bse.ap.gov.in/లో చూడొచ్చు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
1) https://www.bse.ap.gov.in/ దీనిపై క్లిక్ చేయండి
2) హోం పేజీపై కనపడుతున్న ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి
3) మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
4) మీ మార్క్ షీట్ ఓపెన్ అవుతుంది
5) మీ జాబితాను అక్కడే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

SSC PUBLIC EXAMS 2023 - SCHOOL WISE RESULT LINK: Open Below Link

SCHOOL LOGIN DIRECT LINK CLICK HERE

https://www.bse.ap.gov.in/apsscadmissions/Account/Login.aspx

Click the Below Links to Check SSC Results


http://results.bse.ap.gov.in    

http://results.eenadu.net/

www.eenadu.net

https://pratibha.eenadu.net/

https://bse.ap.gov.in/

https://resultsbse.ap.gov.in/

https://resultsbie.ap.gov.in/

http://www.manabadi.co.in/

Wednesday, 29 March 2023

సడెన్​గా మైకం కమ్మినట్లు అనిపిస్తుందా..? దేనికి సంకేతమో తెలుసా?

సడెన్​గా మైకం కమ్మినట్లు అనిపిస్తుందా..? దేనికి సంకేతమో తెలుసా?


మనలో చాలామందికి ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్లు, మైకం కమ్మినట్లు కొద్ది క్షణాలు అనిపిస్తుంటుంది. కాసేపటి తర్వాత తిరిగి మామూలైపోతుంటుంది. అయితే చాలామంది ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకోరు.

కానీ ఆరోగ్యం మీద జాగ్రత్త వహించే వాళ్లు మాత్రం అసలు ఇలా ఎందుకు జరుగుతోందని మదనపడుతుంటారు. ఇలా మైకం రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.చాలాసేపు ఒకే చోట కూర్చొని హఠాత్తుగా లేవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంటుంది. కొంతమందికి నడుస్తున్న సమయంలో లేదంటే వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు మైకం కమ్మిన భావన కలుగుతుంటుంది.



 అసలు మైకం కలిగిన భావన లేదంటే కళ్లు తిరిగినట్లు ఎందుకు అనిపిస్తుంది. దాని వెనక ఉన్న కారణాలు ఏంటో చూద్దాం.

మన శరీరంలో ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం మన ఆరోగ్యం మీద ఉంటుంది. మనలో చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. 

ఉదాహరణకు కొందరికి కూల్ డ్రింక్ తాగినా లేదంటే ఐస్ క్రీం తిన్నా తలనొప్పి మొదలవుతుంటుంది. నిజానికి అంతకుముందు వరకు వాళ్లకు తలనొప్పి లేకపోయినా తమ శరీరానికి తగని ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది మొదలవుతుంది.

చాలామంది తమ పనులు చేసుకుంటున్న క్రమంలో మైకం కమ్మిన భావనను ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వర్కవుట్ చేయడం, తగిన పోషకాహారం తినకపోవడం, బ్లడ్ ప్రెషర్ తగ్గడం, తగినంత నీరు లేకపోవడం, శరీరం వేడెక్కడం లాంటి ఇతర కారణాల వల్ల మైకం కమ్మడం లేదంటే తల తిరగడం, కళ్లు తిరగడం జరుగుతుంటాయి. ఈ కారణాల గురించి మరింత తెలుసుకుందాం.


వర్కవుట్ కారణం కావచ్చు:
చాలామంది అథ్లెట్లు ఎక్కువగా వర్కవుట్ చేస్తుంటారు. వారి కెరీర్ కోసం వాళ్లు అలా చేస్తుండగా దీని వల్ల గుండె పనితీరులో మార్పు వస్తుంది. ఈ సమయంలో గుండె బలంగా మారి తక్కువ హృదయ స్పందనల్లో ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తోంది. గుండె బలపడటం వల్ల ఇలా జరగ్గా వర్కవుట్ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో గుండెకు ఒక్కసారిగా విశ్రాంతి లభించడం వల్ల మైకం కమ్మిన భావన కలుగుతుంటుంది.

తగినంత తినకపోవడం కారణం కావచ్చు:
కొంతమంది రకరకాల కారణాల వల్ల తగినంత ఆహారాన్ని తినకుండా.. జ్యూస్​లతో కాలం వెల్లదీస్తుంటారు. దీని వల్ల శరీరంలో చక్కెరల స్థాయి పడిపోయి మైకం కమ్మినట్లు అనిపిస్తుంటుంది. కాబట్టి భోజనాన్ని మిస్ కాకుండా చూసుకోవడమే కాకుండా స్నాక్స్ కూడా తీసుకోవడం ఉత్తమం.

బ్లడ్ ప్రెషర్ నెమ్మదించడం:
మన శరీరంలో క్షణాల వ్యవధిలో మెదడు నుంచి కాళ్ల వరకు రక్తం పారుతుంది. అయితే మన శరీరంలో నరాల వ్యవస్థ కొన్నిసార్లు నెమ్మదిగా స్పందిస్తే రక్త ప్రవాహంలో మార్పు కలుగుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్​లో మార్పు రావడం వల్ల మైకం కమ్మినట్లు భావన కలుగుతుంది.

తగినంత నీటిని తీసుకోకపోవడం:
మనలో చాలామంది డీహైడ్రేట్ అయినా కూడా పట్టించుకోరు. తక్కువ నీటిని తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే శరీరానికి తగినంత నీరు అందకపోతే మైకం కమ్మిన భావన కలుగుతుంది. కాబట్టి శరీరానికి ఏదో ఒక రూపంలో తగినంత నీరు అందేలా చూసుకోవాలి.

శరీరం వేడెక్కడం:
వర్కవుట్ వల్ల లేదంటే వేడి పరిస్థితుల వల్ల కొన్నిసార్లు శరీరం వేడెక్కుతుంది. ఇది కూడా మైకం రావడానికి కారణం కావచ్చు. వర్కవుట్ చేసేటప్పుడు శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుందని చూసుకోండి. అలాగే వేడి వాతావరణంలో మీ శరీరం గురించి పట్టించుకోవడం మంచిది.


లోపలి చెవి సమస్య కారణం కావచ్చు:
కొన్నిసార్లు లోపలి చెవితో ఏదైనా సమస్య ఏర్పడినా కూడా మైకం వస్తుంది. నిజానికి మైకం రావడం వల్ల అనారోగ్య సమస్య ఉన్నట్లు కాదు. కానీ మైకంతో పాటు వేరే ఏదైనా అనుభూతి చెందితే మాత్రం అందుకోసం వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే


Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే


అధిక వేడిని శరీరం తట్టుకోలేక వడదెబ్బ బారిన పడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గి, డీహైడ్రేషన్ బారిన పడడం వల్ల వడదెబ్బ కలుగుతుంది. 

బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు శరీరం తనలోని వేడిని నియంత్రించుకోలేక విఫలమవుతుంది.



అలాంటి సమయంలోనే వడదెబ్బలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. వెంటనే ప్రథమ చికిత్స చేస్తే వారిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడుకోవచ్చు.

వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ తగిలిన వెంటనే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఒక్కోసారి 104° ఫారెన్ హీట్ దాటుతుంది. అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు. 

గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా లేదా తక్కువగా తీసుకోవడ, రక్తపోటు పెరగడం లేదా తగ్గడం, చెమట పట్టకపోవడం, వికారం, వాంతులు కావడం, స్పృహ కోల్పోవడం వంటివన్నీ జరుగుతాయి. వడదెబ్బ తగిలిన వెంటనే ప్రాథమిక చికిత్సను అందిస్తే వారిని కాపాడుకోవచ్చు.

ప్రథమ చికిత్స ఇలా...
వడదెబ్బ తగిలిన రోగిని చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. అలా శరీరం అంతా తుడుస్తూ ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీలు వచ్చే వరకు అలా చల్లని నీటితో వస్త్రంతో తుడుస్తూ ఉండాలి. చల్లని పానీయాలను అందించాలి. ఎటువంటి మందులు ఇవ్వకూడదు. 

గాలి తగిలేచోట ఉంచాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ వాటర్ లో కాస్త ఉప్పు కలిపి తాగించడం మంచిది. ఓఆర్ఎస్ అందుబాటులో ఉంటే దాన్ని తాగిస్తే ఎంతో మేలు.

 ఈ పనులు చేస్తూనే మరోపక్క ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేయాలి. ఎందుకంటే కొంతమందిలో వడదెబ్బ తీవ్రంగా కొడితే ప్రాణానికే ప్రమాదం కావచ్చు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎండలు పెరిగిపోతున్న ఈ కాలంలో వడదెబ్బ కొట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బయట ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో ఎక్కువసేపు ఎండకు గురవ్వకపోవడమే మంచిది. 

బయటికి వెళ్లే ముందు చల్లని పానీయాలు తాగి వెళ్లాలి. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. మద్యాన్ని పూర్తిగా మానేయాలి. లేత రంగులో ఉండే వస్త్రాలు ధరించాలి. అవి వదులుగా ఉండేలా చూసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవడం అన్ని విధాలా మంచిది.

ఎండలు పెరుగుతున్నప్పటినుంచి రోజూ మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. వడదెబ్బను తట్టుకునే శక్తిని పానీయాలు అందిస్తాయి. చల్లని పానీయాలు, మజ్జిగ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ పడిపోకుండా ఉంటాయి. 

వేసవిలో ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడం మంచిది. దాహాన్ని పెంచేసే మాంసాహారాన్ని, మసాలా నిండిన ఫుడ్కు, స్పైసీ ఫుడ్కు దూరంగా ఉండటం మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Thursday, 23 March 2023

Fan Speed Increase : ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉందా.. ఎలక్ట్రీషియన్‎తో పన్లేదు మీరే చేస్కోండి

Fan Speed Increase : ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉందా.. ఎలక్ట్రీషియన్‎తో పన్లేదు మీరే చేస్కోండి


 Fan Speed Increase : ఎండాకాలం వచ్చేసింది. వేడికి ఇంట్లో ఉండలేని పరిస్థితి. పైగా ఫ్యాన్ చూస్తే స్పీడ్ తక్కువగా ఉండి గాలి తగలడం లేదు.. ఎలక్ట్రీషియన్ ఎన్ని సార్లు పిలిచినా రావడం లేదా..

ఇక ఈ బాధలకు చెక్ పెట్టేయండి. మీరే మీ ఇంట్లో ఫ్యాన్ స్పీడ్ పెంచుకోండి. ఎలక్ట్రిషన్ అవసరం లేకుండా చిన్న చిట్కాలను పాటించి ఫ్యాన్ స్పీడ్ పెంచుకోండి.

వేసవిలో ఫ్యాన్‌కి గాలి సరిగా రాకపోవడంతో వేడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక్కసారి తగినంత వోల్టేజీ ఉన్నా ఫ్యాన్లకు సరిగా అందదు.


 ఎండాకాలం ప్రారంభం కాగానే ఈ సమస్య ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. తక్కువ వోల్టేజీ ఇచ్చిన తర్వాత కూడా పవర్ యూనిట్ అదే స్థాయిలో ఉపయోగించబడుతుంది.. కానీ గాలి తగలదు. అటువంటి పరిస్థితిలో ఫ్యాన్‌ను రిపేర్ చేయడం అవసరం. అల్పపీడనాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఫ్యాన్ కింది వైపు గాలిని విసురుతుంది. ఫ్యాన్ బ్లేడ్ ముందు భాగం సూటిగా, వక్రంగా ఉంటుంది. 

కోణాల భాగం, వంకరగా ఉన్న భాగంలో ధూళి ఎక్కువగా పేరుకుపోయినప్పుడు.. ఫ్యాన్ సరిగ్గా నడవదు. అందువల్ల స్పీడ్ తక్కువగా ఉంటుంది. అప్పుడే గాలి తగలదు.


ఫ్యాన్ బ్లేడ్లకు దుమ్ము కణాలు వాటి కోణాల భాగంలో మందపాటి పొరను ఏర్పరచడం ద్వారా స్పీడ్ తగ్గుతుంది. ఫ్యాన్‌పై ఈ దుమ్ము పేరుకుపోయిన వెంటనే ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ మోటారుపై ఒత్తిడి ఏర్పడి కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. అధిక పీడనం కారణంగా ఫ్యాన్ వేగం తగ్గుతుంది.

 విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అది సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ కూలర్ లేదా మరేదైనా. ఈ సమస్య ప్రతీ దానిలో తలెత్తుతుంది.

ఫ్యాన్ స్పీడ్ తగ్గిన వెంటనే ఎలక్ట్రీషియన్‌ను పిలవాల్సిన అవసరం లేదు. మీరు దానిని మీరే సులభంగా పరిష్కరించవచ్చు. ఇందుకోసం ముందుగా ఫ్యాన్ బ్లేడ్ ముందు భాగాన్ని తడి గుడ్డతో శుభ్రం చేయాలి. శుభ్రపరిచేటప్పుడు బ్లేడ్‌పై ఎక్కువ ఒత్తిడి చేయవద్దు. చాలా ఒత్తిడి బెల్ట్‌లు వంగిపోయేలా చేస్తుంది. 

ఇది బెల్ట్‌ను కూడా దెబ్బతీస్తుంది. అన్ని బెల్ట్‌లను సరిగ్గా శుభ్రం చేసిన తర్వాత ఫ్యాన్ స్పిచ్ ఆన్ చేసి, ఫ్యాన్ స్పీడ్, ఎయిర్ బ్లోయింగ్ స్పీడ్ పెరిగిందో లేదో చూడండి. ఫ్యాన్ బెల్ట్‌లు అన్నీ శుభ్రంగా ఉండి, ఫ్యాన్ గాలిని వేగంగా వీచినప్పుడు.. ఫ్యాన్ మోటార్‌పై తక్కువ లోడ్ పడుతుంది.


లోడ్ తక్కువగా ఉండటంతో విద్యుత్ బిల్లు తగ్గుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది.

Flipkart Electronics Sale: ఈ వాషింగ్ మిషన్ పై ఏకంగా 20 వేల డిస్కౌంట్.. మరో 2 రోజులే ఛాన్స్.. ఓ లుక్కేయండి

Flipkart Electronics Sale: ఈ వాషింగ్ మిషన్ పై ఏకంగా 20 వేల డిస్కౌంట్.. మరో 2 రోజులే ఛాన్స్.. ఓ లుక్కేయండి

 demo2


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో వాషింగ్ మిషన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.


ప్రస్తుతం కొనసాగుతోన్న ఎలక్ట్రానిక్స్ సేల్ లో స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, కూలర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై మంచి డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.


ఎంపిక చేసిన వస్తువులపై 75 శాతం వరకు సైతం తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ సేల్స్ పేజీలో పేర్కొంది. ముఖ్యంగా LG 8 kg Fully Automatic Front Load Black వాషింగ్ మిషన్ పై మంచి డిస్కౌంట్ ఉంది.


ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ.58,990 కాగా.. 34 శాతం డిస్కౌంట్ ఉంది. అంటే ఎవరైనా రూ.20,391 తగ్గింపుతో కేవలం రూ.38,599కే ఈ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకోవచ్చు.


ఇంకా అనేక బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. మీరు 10 శాతం తగ్గింపుతో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైన ఈ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా ధర రూ.1500కు పైగా తగ్గుతుంది.


ఐడీబీఐ, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సైతం కొనుగోలు చేసినా ధర తగ్గుతుంది. ఇంకా ఈ వాషింగ్ మిషన్ పై ఎక్సేంజ్ ఆఫర్ సైతం ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.


మీరు మీ పాత వాషింగ్ మిషన్ ను ఎక్సేంజ్ చేయం ద్వారా రూ.4200 వరకు అదనపు తగ్గింపు అందుకోవచ్చు.


Thursday, 2 March 2023

Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్‌.. పిగ్మెంటేషన్‌కు చెక్‌! ముఖం మెరిసేలా..

Beauty Tips: కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్‌.. పిగ్మెంటేషన్‌కు చెక్‌! ముఖం మెరిసేలా..


స్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతోపాటు నలుపు మచ్చలు, ముఖం మీద పేరుకున్న మట్టి తొలగిపోతాయి.



రక్త ప్రసరణ మెరుగవటంతో పాటు చర్మంలోని నూనె శాతాన్ని తగ్గించే ఈ ఐస్‌ క్యూబ్స్‌ బ్యూటీ టిప్స్‌ను తెలుసుకుందాం.

తులసి, అలొవెరా జెల్‌
ఒక బౌల్‌లో నీళ్లు తీసుకుని అందులో గుప్పెడు తులసి ఆకుల్ని నలిపి వేయాలి.
ఆ తర్వాత రెండు స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి బాగా కలపాలి.
ఆ నీటిని ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఈ ఐస్‌క్యూబ్స్‌తో చర్మాన్ని రుద్దితే ముఖ చర్మం తాజాగా మెరవడంతోపాటు వేడివల్ల వచ్చిన మచ్చలు తొలగి పోతాయి.

స్పిన్‌ ఇన్ఫెక్షన్స్‌ రాకుండా
ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో ఒక కప్పు రోజ్‌వాటర్‌తో పాటు కప్పు మంచి నీళ్లు కలపాలి. దీనిని ఫ్రీజర్‌లో ఉంచాలి.
ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలు తగ్గిపోతాయి. స్కిన్‌ ఇన్ఫెక్షన్స్‌ దరి చేరవు.
దీంతోపాటు ముఖం ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది.

దోసకాయ ముక్కలతో
ఒక బౌల్‌లో మెత్తగా దంచిన దోసకాయ ముక్కలను వేయాలి. దీనికి ఐదారు చుక్కల నిమ్మరసం కలపాలి.
ఇందులో ఐస్‌క్యూబ్స్‌ వేసి కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. తీసిన తర్వాత వీటితో ముఖంపై రబ్‌ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి నొప్పులు, మొటిమలు తగ్గిపోతాయి. కమిలినట్లుగా ఉన్న ముఖం తాజాగా మారుతుంది.

కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌తో
చర్మ సౌందర్యానికి కుంకుమ పువ్వుకి సాటి లేదు.
కుంకుమ పువ్వును కొంచెం రోజ్‌ వాటర్‌లో కలపాలి.
ఈ రెండిటినీ బాగా కలిపాక.. ఐస్‌ క్యూబ్స్‌ ట్రేలో వేసి క్యూబ్స్‌ తయారు చేసుకోవాలి.



వాటితో ముఖం మీద సున్నితంగా మర్దన చేస్తే పిగ్మెంటేషన్‌ , నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖ్యంగా స్కిన్‌టోన్‌ మారిపోతుంది.

Recent Posts