తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ ఫీజు గడువు పెంపు.. చివరితేదీ ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును వచ్చే నెల ఏడో తేదీకి పెంచుతున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ ప్రకటించారు.
ఈ మేరకు సోమవారం కొత్త షెడ్యూల్ ప్రకటించారు. ఎలాంటి ఫైన్ లేకుండా వచ్చేనెల 7 వరకు, రూ.50 ఫైన్తో నవంబర్ 23 వరకు, రూ.200 ఫైన్తో డిసెంబర్ 9 వరకు, రూ.500 ఫైన్తో డిసెంబర్ 23 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. దాంతో టెన్త్ స్టూడెంట్లు ఫీజు చెల్లించే అవకాశం లేకుండా పోయింది.
హెడ్మాస్టర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
0 comments:
Post a Comment