Sunday, 17 November 2019

అమ్మ ఒడి కార్యాచరణకు షెడ్యూల్‌

పకడ్బందీగా ‘అమ్మ ఒడి*
*పాఠశాల విద్యాశాఖ ఆదేశం*
*కార్యాచరణకు షెడ్యూల్‌*
*రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధి విధానాలపై డీఈవోలు, ఎంఈవోలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టి పూర్తి చేయాలి.


*🍎షెడ్యూల్‌ ఇలా*

- *పాఠశాల చైల్డ్‌ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల 19లోగా ధ్రువీకరించాలి. ఆ జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకునికి ఈ నెల 24న పంపించాలి.*

- *ఈ జాబితాను 25వ తేదీ నాటికి గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో పెట్టాలి*

- *వీటిపై అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకునికి తెలపాలి.*

- *ఆధార్‌ నంబర్, ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ లేని విద్యార్థుల వివరాలను  గ్రామ వలంటీర్ల ద్వారా నవంబరు 25 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు సేకరించాలి.*

- *ఆ సమాచారాన్ని విద్యా, సంక్షేమ సహాయకుడు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి నేరుగా అందించాలి.*

- *ప్రధానోపాధ్యాయుడు ఆ సమాచారాన్ని ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ పోర్టల్‌లో డిసెంబరు 5 నాటికి అప్‌డేట్‌ చేయాలి.*

- *అర్హులైన తల్లుల/సంరక్షకుల ముసాయిదా జాబితాను డిసెంబరు 8 నాటికి రూపొందించి గ్రామ సచివాలయంలోని విద్యా, సంక్షేమ సహాయకునికి ప్రధానోపాధ్యాయులు పంపించాలి.*

- *ముసాయిదా జాబితాను  సచివాలయంలో విద్యా, సంక్షేమ సహాయకుడు గ్రామ స్థాయిలో డిసెంబర్‌ 9న ప్రకటించాలి.*

-  *ప్రకటిత సమాచారంపై గ్రామస్తులు లేదా లబ్ధిదారులు అభ్యంతరాలు వ్యక్తం చేయటానికి 3 రోజులు గడువు ఇస్తారు.*

- *ముసాయిదా జాబితాకు డిసెంబర్‌ 15 నుంచి 18లోగా గ్రామసభ ఆమోదం పొందాలి.*

- *ఆమోద జాబితాను గ్రామ సచివాలయ సహాయకుడు డిసెంబర్‌ 20 నాటికి అందజేయాలి.*

- *ఆ జాబితాలను ప్రధానోపాధ్యాయుడు ఎంఈవో ద్వారా డీఈవోకు డిసెంబర్‌ 23లోగా పంపించాలి.*

*డీఈవో డిసెంబర్‌ 24 నాటికి కలెక్టర్‌ ఆమోదం కోసం సమర్పించాలి.*
Click here to Download HM Confirmation Certificate

0 comments:

Post a Comment

Recent Posts