Thursday, 16 April 2020

గడువు ముగుస్తున్న థర్డ్‌ పార్టీ వాహన, ఆరోగ్య బీమా పాలసీల పునరుద్ధరణకు గడువును మే 15 వరకు పొడిగించినట్లు కేంద్రo

★ లాక్‌డౌన్‌ నేపథ్యంలో గడువు ముగుస్తున్న థర్డ్‌ పార్టీ వాహన, ఆరోగ్య బీమా పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వ  ఊరట.


★ బీమా పాలసీల పునరుద్ధరణకు గడువును మే 15 వరకు పొడిగించినట్లు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ట్విటర్‌ వేదికగా తెలిపారు.

★ మార్చి 25 నుంచి మే 3 తేదీల మధ్య గడువు ముగియనున్న థర్డ్‌ పార్టీ వాహన, ఆరోగ్య పాలసీలకు ఈ వెసులుబాటు వర్తించనుంది.


★ తొలుత అమలులో ఉన్న లాక్‌డౌన్‌ సందర్భంగా కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ పాలసీ చెల్లింపుల గడువును పొడిగిస్తూ గతంలో కూడా నోటిఫికేషన్ జారీ.

★ మే 15కు ముందుగానే రెన్యువల్‌ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా పాలసీదారులకు ఎదురయ్యే సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


★ ఈ గ్రేస్‌ పీరియడ్‌ కాలంలో వచ్చిన క్లెయింలకు ఏ ఆటంకాలు కలిగించకుండా చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆర్థిక మంత్రి బీమా సంస్థలకు సూచన.

0 comments:

Post a Comment

Recent Posts