*ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు వెలిగించండి. కరోనా చీకట్లను తరిమేద్దాం.*
భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఉదయం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'' మేము ఒక్కరమే ఇంట్లో ఉంటే ఏమి సాధిస్తామని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లే. జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులు తమ శక్తి సామర్థ్యాలు చాటారు. భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయి. లాక్డౌన్ను మరింత కఠినంగా పాటించాలి.
ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి. ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలి.
130 కోట్ల మంది ఈ సమయాన్ని నాకు ఇవ్వాలని కోరుతున్నా. సంకట సమయంలో ఇది భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. కరోనాపై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు'' అని మోదీ అన్నారు.
0 comments:
Post a Comment