Thursday, 23 April 2020

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యం (డీఏ) రద్దు

కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన కరువు భత్యం (డీఏ) రద్దు


లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంచరాదని నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి పెండింగ్ ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించరు. దీని ప్రకారం 2021 జులై వరకూ డిఏ, డీఆర్ పెరగదు.

దేశ వ్యాప్తంగా మార్చి 24 అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకూ తొలి విడత లాక్‌డౌన్ కొనసాగగా రెండో విడత లాక్‌డౌన్ మే 3 వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. అన్ని రంగాలూ మూతపడ్డాయి. ఆర్ధిక వ్యవస్థ కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు సూచిస్తున్న తరుణంలో డిఏ పెంచరాదని కేంద్రం నిర్ణయించింది.
ఆర్ధిక రంగానికి సంబంధించి కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించారు.


0 comments:

Post a Comment

Recent Posts