Sunday, 31 May 2020

ఐదో క్లాసులోపు పిల్లలు వారానికి 2సార్లే కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదన

*ఐదో క్లాసులోపు పిల్లలు వారానికి 2సార్లే* 

*ఒకసారి 30-50 శాతం విద్యార్థులను మించి స్కూలుకు హాజరుకాకుండా చూసుకోవాలని, బడిని రెండు షిఫ్టులు నడిపించేలా కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదించింది.* 

*1 నుంచి 5వ తరగతి విద్యార్థులు వారానికి రెండుసార్లు...* 

*6 నుంచి 8వ తరగతి విద్యార్థులు వారానికి 2 నుంచి 4 సార్లు...* 

*9 నుంచి 12వ తరగతి వరకు వారానికి 4 నుంచి 5సార్లు బడికి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.*

*బోధనా పరంగా టైమ్‌ టేబుల్‌ను కూడా మార్చనుంది.*

 *ప్రస్తుతం 45 నిమిషాల పాటు బోధించే ఒక పీరియడ్‌ను 30 నిమిషాలకు కుదించాలని భావిస్తోంది.* 

*పరీక్షల విధానాన్నీ సవరించాలని ఆలోచిస్తోంది.*


 *ఒత్తిడి లేని అసెస్ మెంట్  లేదా పరీక్షలకు మొగ్గుచూపుతోంది.*

 *5వ తరగతి లోపు విద్యార్థులకు స్కూలు బ్యాగు తప్పనిసరి కాదని నిర్ణయించే అవకాశం ఉంది.* 

*మరోవైపు, వివిధ ప్రాంతాలకు వసల వెళ్లి తిరిగి వచ్చిన కార్మికుల పిల్లలకు దగ్గర్లోని బడుల్లో ప్రవేశం కల్పించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల కు కేంద్రం సూచించనుంది.*

 *ఏదైనా గుర్తింపు కార్డు ఆధారంగా అడ్మిషన్‌ ఇవ్వాలని, టీసీ అడగకూడదని ప్రతిపాదించనుంది.*

0 comments:

Post a Comment

Recent Posts