Monday, 11 May 2020

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం పదో తరగతి విద్యార్థులకు వాట్సాప్ లింక్స్

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం పదో తరగతి విద్యార్థులకు వాట్సాప్ లింక్స్
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట వాట్సప్ ద్వారా ప్రాక్టీస్ ప్రశ్నలను పంపి, విద్యార్థులు నుంచి వాటి సమాదానాలు రాబట్టనుంది.

ప్రతి పాఠశాల తమ విద్యార్థులు, టీచర్లతో వాట్సప్ గ్రూప్ క్రీయేట్ చేసి అందులో విద్యార్థులకు ప్రశ్నలు పంపనుంది. ఉదాహరణకు tv లో ప్రసారమయ్యే పాటలకు సంబంధించి అడిగే ప్రశ్నలను విద్యార్థులకు వాట్సప్ లో పంపితే... వాళ్ళు సమాదానాలు వాట్సప్ ద్వారా తిరిగి పంపివ్వాలి...అయితేఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తోంది. మొత్తం 24 వేల మంది విద్యార్థులు, 933 మంది టీచర్లు..

ఈ ఆన్‌లైన్ క్లాసుల్లో చేరనున్నారు. లెక్చరర్లు తమ క్లాసులను వీడియో రికార్డు చేసి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ యూట్యూబ్ యూఆర్‌ఎల్ లింక్స్‌ని వాట్సాప్ గ్రూపు లేదా ఈ మెయిల్‌లో విద్యార్థులకు పంపుతారు.


విద్యార్ధులు ఆ లింక్‌ ఓపెన్ చేసి.. వీడియో చూసి.. లెసెన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వారు తయారు చేసుకునే నోట్స్‌ను వాట్సాప్ లేదా ఈ మెయిల్‌ ద్వారా టీచర్లకు పంపాలి. దీంతో కరోనా వైరస్ కట్టడితో పాటు విద్యార్థులకు కూడా సమయం వృథా కాకుండా ఉంటుంది.

0 comments:

Post a Comment

Recent Posts