Tuesday, 19 May 2020

Important Events of May 18

Important Events of May 18
🌎 *చరిత్రలో ఈ రోజు*
🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *అంతర్జాతీయ వస్తు ప్రదర్శనశాల దినోత్సవం

🏀 *సంఘటనలు*

✴1642: కెనడా దేశంలోని రెండవ పెద్ద నగరమైన మాంట్రియల్ స్థాపించబడింది.
✴1804: ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తిగా ప్రకటించింది.
✴1830 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబరు 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
✴1860: చికాగో లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశం లో, అబ్రహం లింకన్ ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ).
✴1910: హేలీ తోకచుక్క భూమి మీద నుంచి కనిపించి, సూర్యుని వైపు తరలిపోయింది.
✴1914: పనామా కాలువ ద్వారా కార్గో (సరుకు/సామాను) తో ప్రయాణించిన మొట్ట మొదటి స్టీం బోటు (ఆవిరితో నడిచే పడవ) పేరు మారినర్ .
✴1969: రోదసీ నౌక అపొలో 10 ని, ముగ్గురు రోదసీ యాత్రికుల (1. యూజీన్ ఎ. సెమన్, 2. థామస్ పి. స్టాఫర్డ, 3. జాన్ డబల్ యు. యంగ్) తో రోదసీ లోకి ప్రయోగించారు.
✴1991: సోవియట్ సోయుజ్ అంతరిక్ష నౌకలో హెలెన్ షర్మన్ (మొట్ట మొదటి బ్రిటన్ మహిళ) అంతరిక్షంలోకి వెళ్ళింది.
✴2005: కువాయిట్ పార్లమెంట్ ఆడవారికి ఓటు హక్కు ఇచ్చింది.
✴2006: నేపాల్ రాజు యొక్క అధికారాలను తగ్గించటానికి, నేపాల్ పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది
✴2006: అంగోలా లో కలరా వ్యాపించింది.
✴2007: అంటార్కిటిక్ సముద్రం లో 700 కొత్త జీవులను కనుగొన్నారు.
✴2011: స్పేస్ షటిల్ ఎండీవర్ ఆఖరి సారిగా ‍ (చివరి ప్రయాణం) రోదసీలోకి వెళ్ళింది.
✴2012: రూపాయి మారకం విలువ డాలరు తో పోలిస్తే 54.90 స్థాయికి పడిపోయింది. రూపాయి – డాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇1048: పర్షియా మహాకవి ఒమర్ ఖయ్యాం ఇరాన్ లోని నైషాపూర్ లో జననం (మ.1131).
❇1850: ఆలివర్ హీవిసైడ్, భౌతిక శాస్త్రవేత్త. అయనోస్పియర్ అనేది ఒకటి ఉందని, అది రేడియో తరంగాలను పరావర్తింప చేస్తుందని ఊహించి చెప్పిన శాస్త్రవేత్త.
❇1877: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (మ.1923)
❇1883: జర్మన్ ఆర్కిటెక్ట్ (భవన నిర్మాత) వాల్టర్ గ్రోపియస్, బౌహౌస్ స్కూలు స్థాపకుడు జననం.
❇1914: సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (మ.2010)
❇1932: దూపాటి సంపత్కుమారాచార్య, సత్తుపల్లి లోని శారదా విద్యానికేతన్ కులపతి, రచయిత, శతావధాని
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*

◾1886: అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (జ.1820)
◾1986: కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (జ.1902)
◾1987: ఆసియా దేశాల పేదరికం పై రచనలు చేసిన ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ మరణం (జ.1898).
◾1995: నటి ఎలిజబెత్ మాంట్ గోమెరి, లాస్ ఏంజిల్స్ లో మరణించింది.
◾2013: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (జ.1915)
◾2014: పి.అంకమ్మ చౌదరి, హేతువాది, మానవతావాది. మానవతా విలువలున్న న్యాయమూర్తి.
◾2018: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (జ.1938)

0 comments:

Post a Comment

Recent Posts