🔳ఎస్వీయు పిజి ప్రవేశ పరీక్షల షెడ్యూల్
శ్రీ వేంకటే శ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయు) పిజి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను డైరెక్టర్ ఆచార్య వెంకటేశ్వర్లు ఆదివారం విడుదల చేశారు. ఎస్వీయు రెక్టార్ ఛాంబర్లో రిజిస్టర్ రెక్టార్ ఆచార్య వైపి శ్రీధర్ రెడ్డి, ఆచార్య జిఎం సుందరవల్లి పాల్గన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వీయు పరిధిలో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు, డిగ్రీ పూర్తి అయిన వారు పిజి కోర్సులలో ప్రవేశించేందుకు 2020-21 సంవత్సరానికిగాను ఈ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ 3వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. 5న దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ అని తెలిపారు. పూర్తి వివరాల కోసం షషష.రఙబసశీa.ఱఅ వెబ్సైట్ను సందర్శించాలన్నారు. ఇతర వివరాలకు ఎస్వీయు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆఫీస్ నెంబర్ 0877-2248589, 2289346 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ) 2020-21 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 03, 2020.
దరఖాస్తుకు చివరి తేది: జులై 05, 2020.
వెబ్సైట్: http://www.svudoa.in/
0 comments:
Post a Comment