Thursday, 20 August 2020

ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌- 2020 నోటిఫికేషన్‌

 ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌- 2020 నోటిఫికేషన్‌



దీనిద్వారా అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి.. ఉన్నత స్థాయి విద్య, శిక్షణ ఇచ్చి ఆర్మీలోని ఉన్నత స్థాయి ఉద్యోగాలలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా ఇండియన్‌ ఆర్మీ 10+2 ఎంట్రీ స్కీమ్‌ 2020కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ అర్హతతో ఆర్మీలో ఉద్యోగం చేపట్టేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 90
కోర్సు: 
10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌

అర్హతలు:

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ఇంటర్మీడియెట్‌ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • జూలై 2, 2001 నుంచి జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. అభ్యర్థి 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 మధ్య వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఎంట్రీ స్కీమ్‌లో ఎంపికైన అభ్యర్థులకు మొత్తం ఐదేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. ఇందులో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్, టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఉంటాయి.
స్టైపెండ్‌: రూ.56,000

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 9, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: 



www.joinindianarmy.nic.in

0 comments:

Post a Comment

Recent Posts