దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న ఎగ్జామ్ నీట్. జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ . లక్షలాదిమంది రాసే ఈ పరీక్షలో నెగ్గటానికి సరైన ప్రణాళిక, నిపుణుల మార్గదర్శకత్వం అవసరం. ఈ పరీక్షలో మంచి ర్యాంక్ సాధిస్తే ఎంబీబీఎస్ సీటు వచ్చినట్టే. 720 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 600 పైగా మార్కులు సాధిస్తే తప్పనిసరిగా సీటు వస్తుంది.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరగబోయే.. నీట్ 2020 పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలను జాతీయ పరీక్షల మండలి (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వివరాలను అధికారిక వెబ్సైట్ https://ntaneet.nic.in /
నీట్ 2020కు పెరిగిన పోటీ:
వైద్య విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా సెప్టెంబరు 13న నిర్వహించనున్న నీట్(యూజీ)-2020కు మొత్తం 15,97,433 మంది హాజరుకానున్నారు. గత ఏడాది 15,51,753 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి మరో 45,680 మంది అధికంగా పోటీ పడనున్నారు.
కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా:
*పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులందరూ గుంపుగా రాకుండా స్లాట్ల విధానం అమలు చేస్తున్నారు.
*దీంతో ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
*ఎవరు ఏ సమయంలో రావాలో హాల్టికెట్లపై ముద్రిస్తారు.
*విద్యార్థుల సెల్ఫోన్లకు వివరాలను మేసేజ్ రూపంలో పంపిస్తారు.
*పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడకుండా గేటు బయట భౌతిక దూరం పాటించేందుకు తాళ్లు కట్టనున్నారు.
వాటి వరుసల మధ్య నుంచే విద్యార్థులు లోపలికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
0 comments:
Post a Comment