APOSS -ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేయడమైనది మరియు పరిక్ష ఫీజు కట్టి పరిక్షకు హాజరగుటకు అర్హత కలిగిన అభ్యాసకు లందరినీ ఉత్తీర్ణత ప్రెస్ నోట్*
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము, గుంటూరు వారిచే నిర్వహించబడు ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, 2020 మొదటగా 25.04. 2020 నుండి
02.05.2020 వరకు నిర్వహించబడవలసి ఉండగా COVID-19 పరిస్థితుల వలన, లాక్డౌన్ విధించినందు వల్ల 18.07.2020 నుండి 24.07.2020 వరకు జరుపుటకు గాను వాయిదా వేయబడినది.
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here
ఆ తరువాత కూడా పరిస్థితులలో మార్పు లేనందు వల్ల పరీక్షకు హాజరగు అభ్యాసకుల క్షేమము మరియు భద్రత దృష్ట్యా ప్రభుత్వము జులై-2020 లో జరగవలసిన ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేయడమైనది మరియు పరిక్ష ఫీజు కట్టి పరిక్షకు హాజరగుటకు అర్హత కలిగిన అభ్యాసకులందరినీ ఉత్తీర్ణత
చేస్తూ వారికి మార్కులు మరియు గ్రేడ్ లను వారికి ప్రిపరేటరీ పరీక్ష లలో సాధించిన మార్కుల ఆధారంగా మార్కులు మరియు గ్రేడ్ లు ఇచ్చుటకు నిర్ణయించబడినది.
0 comments:
Post a Comment