Tuesday, 6 October 2020

ఏపీలో ప్రాథమిక విద్య నుంచే సెమిస్టర్‌ విధానం

*ఏపీలో ప్రాథమిక విద్య నుంచే సెమిస్టర్‌ విధానం*

కేంద్రం నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిలబస్‌ని పూర్తిగా మార్చింది.* రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్ధ నూతన సిలబస్ మార్పులపై భారీ కసరత్తే చేసింది. దాదాపు పది దేశాల ప్రాధమిక విద్యావిధానాలని పూర్తిగా పరిశీలించారు. దీంతో పాటు దేశంలోని 15 రాష్ట్రాలకి చెందిన ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌లని‌ కూడా పరిశీలించి కొత్త సిలబస్‌ని రూపొందించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ కమీషనర్‌ చినవీరభద్రుడు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల‌మేరకు నూతన సిలబస్ రూపొందించడంలో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్ధ కీలక పాత్ర పోషించింది. ఇందుకు గాను వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న విద్యావిధానం....అమెరికా, ఆస్డ్రేలియా లాంటి పలు దేశాల విద్యా విధానాలని పరిశీలించింది. ఈ విధంగా ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు దాదాపు 84 రకాల పాఠ్య పుస్తకాలు, 63 వర్క్ బుక్‌లు రూపొందించింది. దాంతోపాటు తమిళం, ఒరియా, కన్నడ, ఉర్ధూ మీడియంలలో కూడా పాఠ్య పుస్తకాలు ముద్రించింది’’ అని తెలిపారు. 

Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

*అంతేకాక ‘మారిన సిలబస్ ప్రకారం ఒకటి, రెండు తరగతులకి తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు.. మూడు, నాలుగు, అయిదు తరగతులకి తెలుగు, ఇంగ్లీష్, మేథ్స్‌, సైన్స్ పాఠ్య పుస్తకాలు.. ఇక ఆరవ తరగతి విధ్యార్ధులకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలగా ఉంటాయి.* మరోవైపు దేశంలోనే తొలిసారిగా ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ఏపీలో ప్రవేశపెడుతున్నారు. ఇందుకు తగినట్లుగానే పాఠ్య పుస్తకాలని మూడు సెమిస్టర్‌లలాగా విభజించారు. అలాగే ఒక పేజిలో తెలుగులో... మరో పేజీలో ఇంగ్లీష్‌లో ముద్రించడం ద్వారా ఇంగ్లీష్ బోధన అర్దమయ్యే రీతిలో పుస్తకాలు రూపొందించింది. దీంతో పాటు తెలుగుకి అత్యధిక ప్రదాన్యతనిచ్చాము. ఇందుకుగాను పాఠ్యాంశాలలో 116 మంది కవులని పరిచయం చేశాము. అలాగే తొలిసారిగా విధ్యార్ధులకి వర్క్ బుక్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చాము. దీంతోపాటు టీచర్స్ కి, తల్లితండ్రులకి‌ కూడా హేండ్ బుక్స్ ఇవ్వనున్నాము’ అని తెలపారు. అంతేకాక విధ్యార్దులని ఆకర్షించే విధంగా రంగురంగుల బొమ్మలతో పాఠ్య పుస్తకాల రూపకల్పన చేశామన్నారు చిన వీరభద్రుడు. (చదవండి: ఒకే వేదికపైకి  వంద విదేశీ వర్సిటీలు )

పాఠ్య పుస్తకాల రూపకల్పన నుంచి ప్రింటింగ్ వరకు విద్యా శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందన్నారు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ డైరక్టర్ మధుసూదనరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత అక్టోబర్ నాటికే టెండర్లు ఖరారు చేయడమే కాకుండా రాష్ట్ర స్ధాయిలో 55 ప్రింటింగ్ ప్రెస్‌లని గుర్తించి వాటి ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ సకాలంలో పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాము. దీంతో పాటు వీటి పర్యవేక్షణకి అయిదు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించాము. రికార్డు స్ధాయిలో మార్చి నెలాఖరునాటుకి హైస్కూళ్లకి.. జూన్ నాటికి ప్రాదమిక పాఠశాలలకి పాఠ్యపుస్తకాలని పంపిణీ చేశాము’ అన్నారు. 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకి అనుగుణంగా విద్యా శాఖలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ స్ధాయిలో మన విద్యార్ధులు పోటీపడే విధంగా సిలబస్ రూపొందించడం ఒక ఎత్తైతే వాటిని సకాలంలో ప్రింట్ చేసి విద్యార్ధుల వరకు చేరవేయగలగటం మరో ఎత్తు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ చరిత్ర సృష్టించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికే స్కూళ్లకి చేరుకున్న ఆ పాఠ్యపుస్తకాలని ఈ నెల 8 న ప్రారంభం కానున్న జగనన్న విద్యాకానుక కిట్‌తో పాటుపాటు విద్యార్ధులకి అందించనున్నాము’ అని తెలిపారు.

8న ‘కృష్ణా’లో జగనన్న విద్యాకానుక ప్రారంభం

జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 8న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘జగనన్న విద్యా కానుక ద్వారా 40 లక్షల మందికి పైగా విద్యార్ధులకి లబ్ది చేకూరుతుంది. జగనన్న విద్యాకానుక పథకానికి సుమారు 650 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాం.  విద్యార్ధులకు ఇచ్చే ఈ కిట్‌లో యూనిఫారం, పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూలు బ్యాగ్ ఇలా వివిధ రకాల వస్తువులని అందిస్తున్నాము. రాష్ట్రంలో విద్యాశాఖకి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, నాడు-నేడు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యాశాఖలో సంక్షేమ పథకాల ద్వారా డ్రాప్ అవుట్స్‌ని తగ్గించడం, ప్రాథమిక స్ధాయి నుంచే అత్యుత్తమ విద్యని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. విద్యా శాఖలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో 2.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో చేరారు. 90 శాతం ఎన్‌రోల్‌మెంట్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామ’ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.*

విద్యార్థులకు వరం: డిప్యూటీ సీఎం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వరం.. జగనన్న విద్యా కానుక అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు ఎన్నడూ ఇలాంటి కిట్లు ఇవ్వలేదని, 4 లక్షలకు పైగా గిరిజన విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నామని చెప్పారు. ‘గిరిజన పిల్లలు కలలో కూడా ఊహించని పథకం ఇది. కార్పొరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ పెరిగేలా సీఎం జగన్ చేశారు. ప్రతి పేద విద్యార్థికి  రూ.1600 విద్యాకానుక ఇస్తున్నాం. గిరిజనులకు ఎన్నడూ లేని సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, అమ్మ ఒడి ఇచ్చిన చరిత్ర సీఎం వైఎస్‌ జగన్‌కే సొంతమ’ని అన్నారు.

0 comments:

Post a Comment

Recent Posts