Monday 28 June 2021

ఆ తర్వాతే టీచర్ల భర్తీ ప్రక్రియ

 ఆ తర్వాతే టీచర్ల భర్తీ ప్రక్రియ 

★నూతన విద్యా విధానం అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని,  ఈ విధానం ప్రారంభమైన తర్వాత ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు


★ఆ తర్వాతే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు.

 ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా నూతన విద్యా విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. 


★ప్రస్తుతం 8 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండాల్సిన పరిస్థితి ఉందని, నూతన విద్యా విధానంలో ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. 


 ★విద్యారంగంలో జగన్‌ ప్రభుత్వం  ప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళ్తోందన్నారు. 


★గత రెండేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా 1,83,480 రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వివరించారు. 


★జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య తగ్గిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనీ, ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 


★వచ్చే ఏడాది  పోస్టుల సంఖ్య పెరగవచ్చన్నారు.

 రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని వివరించారు.

0 comments:

Post a Comment

Recent Posts