Friday, 23 July 2021

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం సీఎం జగన్ కీలక నిర్ణయం

 ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం సీఎం జగన్ కీలక నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 16 నుంచి పాఠశాలలను పున: ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అదే రోజున మొదటి విడత ‘నాడు-నేడు’ పనులను ప్రజలకు అంకితమిచ్చి.. రెండో విడత పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 

అటు నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరించడమే కాకుండా.. విద్యార్ధులకు విద్యాకానుక కిట్‌లను సైతం అదేరోజున పంపిణీ చేయాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.


*ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
           
 : ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.

★తొలి విడత నాడు - నేడు  పనులను అదేరోజు ప్రజలకు
   అంకితం..

★విద్యారంగంలో రెండో విడత  నాడు - నేడు పనులకు శ్రీకారం

★విద్యాకానుక కిట్లు కూడా అందజేయనున్న ప్రభుత్వం

★నూతన విద్యావిధానంపై సమగ్రంగా వివరించనున్న
  ప్రభుత్వం..

★విద్యాశాఖలో నాడు - నేడు పై సమీక్షలో సీఎం జగన్
    నిర్ణయం..

      

0 comments:

Post a Comment

Recent Posts