Thursday 15 July 2021

AP -టీచర్ల బదలీలపై విద్యాశాఖ ప్రొసీడింగ్స్ రద్దు

 AP -టీచర్ల బదలీలపై విద్యాశాఖ ప్రొసీడింగ్స్ రద్దు

▪️తీర్పుకు విరుద్ధంగా జీవో 54.

▪️కేటగిరి 3,4 పాఠశాలల్లో రీ కౌన్సెలింగ్ నిర్వహించండి.


 బదిలీల కౌన్సి లింగ్ను కేటగిరి 3, 4 పాఠశాలలకు మాత్రమే వర్తింప చేస్తూ విద్యా శాఖ జారీచేసిన ప్రొసీడింగ్స్ ని హైకోర్టు రద్దు చేసింది.

పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ని సవాల్ చేస్తూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటి షన్లు వేసారు.

 వీటిపై హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ డీవీవీఎస్ సో రూజులు విచారణ జరిపారు. తదుపరి కౌన్సెలింగ్ నిర్దిష్టమైన విధానాలను అనుసరిస్తామని అప్పట్లో అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరాం కోర్టుకు నివేదించారు. దీనిపై బుధవారం మరోసారి విచారణ జరిగింది.

 పిటిషనర్ల తరుపున న్యాయవాది గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు. ఏజీ హామీకి విరుద్ధంగా విద్యాశాఖ అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఏజీ హామీ అమలుకు స్పష్టం చేశారు.


 అందువల్ల ఈ ప్రొసీడింగ్స్ రద్దుచేసి తిరిగి కౌన్సి లింగ్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో ఏకీభవించిన న్యాయమూర్తి విద్యాశాఖ ప్రొసీ డింగ్స్ హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని జీవో 54 లో కూడా ఇదే ప్రస్పుటమైందని వ్యాఖ్యానించారు.

జీవోతో పాటు ధర్మాసనం తీర్పును క్రోఢీకరించి అందుకు అనుగుణంగా తాజాగా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

3 comments:

  1. 2020 టీచర్ల బదీలీలకు కూడ ఆ తీర్పు వర్తిస్తుందా...???

    ReplyDelete
  2. No. Only for municipal merging issue teachers transfered on 15/6/21

    ReplyDelete
  3. అందరికి వర్తిస్తుంది ఎందుకంటే GO 54, 2020 టీచర్స్ ట్రాన్స్ఫర్ కి కూడా వర్తిస్తుంది.... ఒక్కసారి GO చూడండీ అర్ధమవుతుంది

    ReplyDelete

Recent Posts