వాట్సాప్కు పోటీగా 'సందేశ్'.. లాంచ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్ను తీసుకొచ్చింది. సందేశ్గా నామకరణం చేసిన ఈ యాప్ గురించి కేంద్ర సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్సభలో వివరించారు.
సందేశ్కు సంబంధించిన విశేషాలను లిఖిత పూర్వకంగా అందజేశారు. 'సందేశ్ ఓపెన్ బేస్డ్ యాప్. ఇది చాలా సురక్షితమైనది. క్లౌడ్ ఎనేబుల్ అయిన ఈ యాప్కు సంబంధించిన కంట్రోల్ను ప్రభుత్వమే చూసుకుంటుంది.
వన్ టూ వన్ మెసేజింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్ లాంటి ఫీచర్లు ఈ యాప్లో ఉన్నాయి.
గూగుల్ ప్లే స్టోర్తోపాటు యాప్ స్టోర్లో కూడా దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం' అని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
వాట్సాప్లా పని చేసే సందేశ్ను నేషనల్ ఇన్ఫోర్మెటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) డెవలప్ చేసింది. ఎన్ఐసీతోపాటు ప్రభుత్వ ఐటీ వింగ్ కలసి ఈ యాప్ను లాంచ్ చేశాయి. మొబైల్ నెంబర్తోపాటు ఈమెయిల్ ఐడీతోనూ కమ్యూనికేట్ చేసుకునేలా సందేశ్ను డిజైన్ చేశారు.
0 comments:
Post a Comment