గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు డిప్యుటేషన్లు రద్దు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డిప్యుటేషన్లు పూర్తిగా రద్దు చేశారు. బయో మెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించనున్నారు. రోజూ సాయంత్రం ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమానికి ఉద్యోగులంతా విధిగా హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ, పశుసంవర్థక, సంక్షేమశాఖల్లో, పోలీసుస్టేషన్లలో డిప్యుటేషన్లపై సేవలు అందిస్తున్న ఉద్యోగులంతా ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పని చేయాలి.
ఉదయం కార్యాలయానికి వచ్చినపుడు, తిరిగి సాయంత్రం వెళ్లేప్పుడు బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి. జులై 1 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చినా పలు జిల్లాల్లో బయోమెట్రిక్ హాజరు 50 నుంచి 60 % ఉండటంపై సీఎం కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సోమవారం నుంచి ఇది 90 శాతానికిపైగా ఉండాల్సిందేనని కలెక్టర్లకు సూచించారు.అంతకంటే హాజరు తక్కువగా ఉంటే ఎంపీడీవోలను బాధ్యులను చేయనున్నారు.
0 comments:
Post a Comment