టెన్త్ విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు
సెప్టెంబర్ 5 వరకు SSC బోర్డు వెబ్సైట్లో పొందవచ్చు
ఆన్లైన్లోనే దరఖాస్తు, సర్టిఫికెట్ మంజూరు
*🌷అమరావతి:రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాలు విడుదల చేశామని,ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు పరీక్ష రుసుముతో పాటు రూ.80 చెల్లించిన విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్ను సంబంధిత పాఠశాల లాగిన్లో పొందుపరిచామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు.*
*🌴సర్టిఫికెట్ కలర్ కాపీని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయాలన్నారు.*
*🦋ఈ అవకాశం సెప్టెంబర్ 5 వరకు మాత్రమే ఉంటుంది.*
*🌴ఆ తరువాత విద్యార్ధులు మరోసారి రూ.80 రుసుము చెల్లించి,ఆన్లైన్ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్ పొందాలని చెప్పారు.*
*🦋2021 ఏడాది మాత్రమే కాకుండా అంతకు ముందు సంవత్సరాల్లో పదో తరగతి ఉత్తీర్ణులయిన వారు కూడా ఈ సంవత్సరం నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో ప్రభుత్వ పరీక్షలు సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.*
*🌴దరఖాస్తు తేదీ నుంచి 30 రోజుల వరకు మాత్రమే వెబ్సైటులో ఉంటుందన్నారు*
0 comments:
Post a Comment