Wednesday 30 November 2022

TSPSC Non-Gazetted Posts: తెలంగాణలో నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!

TSPSC Non-Gazetted Posts: తెలంగాణలో నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే! తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
 అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 7 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
2023 మార్చి లేదా ఏప్రిల్ నెలలో పరీక్ష నిర్వహిస్తారు. పోస్టుల వివరాలు..
 ➨ గెజిటెడ్ పోస్టులు ఖాళీల సంఖ్య: 25 News Reels 1) టెక్నికల్ అసిస్టెంట్ - హైడ్రోజియోలజీ: 07 
పోస్టులు అర్హత: జియోలజీ/ అప్లయిడ్ జియోలజీ/హైడ్రోజియోలజీ విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ (లేదా) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ధన్‌బాద్ నుంచి డిప్లొమా అసోసియేట్‌షిప్ (అప్లయిడ్ జియోలజీ) ఉండాలి. 
జీతం: రూ.51,320 - రూ.1,27,310.
2) టెక్నికల్ అసిస్టెంట్ - హైడ్రోలజీ: 05 పోస్టులు 
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్). జియోలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. (లేదా) ఎంఎస్సీ (హైడ్రోలజీ) రెండేళ్ల కోర్సు చేసి ఉండాలి. 
జీతం: రూ.51,320 - రూ.1,27,310. 3) టెక్నికల్ అసిస్టెంట్ - జియోఫిజిక్స్: 08 పోస్టులు అర్హత: ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ - జియోఫిజిక్స్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. జీతం: రూ.51,320 - రూ.1,27,310. 4) 
ల్యాబ్ అసిస్టెంట్: 01 
పోస్టు అర్హత: సైన్స్ డిగ్రీ. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
 జీతం: రూ.32,810 - రూ.96,890. 5) 
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు 
అర్హత: బీఎస్సీ (జియోలజీ/మ్యాథమెటిక్స్). 
జీతం: రూ.32,810 - రూ.96,890. 
వయోపరిమితి:01.07.2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 01.07.2004 - 02.07.1978 మధ్య జన్మించి ఉండాలి. 
ఫీజు వివరాలు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నవారు పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా. పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు - 150 మార్కులు, పేపర్-2 వాటర్ రిసోర్సెస్ నుంచి 150 ప్రశ్నలు - 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 తెలుగు, ఇంగ్లిష్‌లో; పేపర్-2 కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. 
పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే. 
ముఖ్యమైన తేదీలు.. 🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.12.2022. 
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.12.2022.

0 comments:

Post a Comment

Recent Posts